ADB: ఉట్నూర్ మండలం గొట్టిగోండగూడ గ్రామానికి చెందిన అనసూయకు శనివారం పురిటి నొప్పులు రావడంతో 108 సిబ్బందికి సమాచారం అందించారు. వెంటనే స్పందించిన సిబ్బంది ఆమెను రిమ్స్ ఆస్పత్రికి తరలిస్తుండగా మార్గమధ్యంలోనే బిడ్డకు జన్మనిచ్చినట్లు ఈఎంటీ అజ్మీరా ప్రవీణ్ కుమార్ తెలిపారు. అనంతరం మెరుగైన చికిత్స కోసం వారిని ఆస్పత్రికి చేర్చినట్లు పైలట్ రాజేందర్ తెలిపారు.