TG: రాష్ట్రంలో కొత్త మద్యం దుకాణాల దరఖాస్తుల ప్రక్రియ ముగింపు సందర్భంగా ఎక్సైజ్ కమిషనర్ కార్యాలయం వద్ద సందడి నెలకొంది. చివరి రోజు దరఖాస్తుదారులు పెద్ద సంఖ్యలో హాజరయ్యారు. వీరిలో APకి చెందిన ఓ మహిళ ఏకంగా 150 మద్యం దుకాణాలకు దరఖాస్తు చేయడం విశేషం. ఈ దుకాణాల కేటాయింపు ప్రక్రియలో భాగంగా ఈ నెల 23న డ్రా నిర్వహించనున్నారు.