ADB: ఆదిలాబాద్ పట్టణంలోని మార్వాడి ధర్మశాలలో గల శ్రీ వెంకటేశ్వర స్వామిని MP గోడం నగేశ్ స్థానిక బీజేపీ నాయకులతో కలిసి మంగళవారం దర్శించుకున్నారు. ముక్కోటి ఏకాదశి పర్వదినాన్ని పురస్కరించుకొని ఆలయంలో ప్రత్యేక పూజ కార్యక్రమాలు నిర్వహించారు. ఆలయ అర్చకులు వారిని ఆశీర్వదించి తీర్థప్రసాదాలు అందజేశారు. ఈ కార్యక్రమంలో నాయకులు వెంకటస్వామి, దేవన్న తదితరులున్నారు.