NRML: జర్నలిస్టుపై దాడి చేసిన సినీ నటుడు మోహన్ బాబును అరెస్టు చేయాలని నిర్మల్ పట్టణంలో జర్నలిస్టులు బుధవారం ర్యాలీ నిర్వహించారు. అనంతరం ఆర్డీవో రత్నకళ్యాణికి వినతి పత్రం సమర్పించారు. జర్నలిస్టులు మాట్లాడుతూ.. న్యూస్ కవరేజ్ కొరకు వెళ్లిన ఓ జర్నలిస్టుపై.. మోహన్ బాబు దాడి చేయడానికి ఖండిస్తున్నామని, పోలీసులు వారిని అరెస్టు చేయాలని కోరారు.