MBNR: దేవరకద్ర నియోజకవర్గం మదనపురంలోని ఊక చెట్టు వాగుపై నిర్మించిన బ్రిడ్జిని త్వరలోనే ప్రారంభిస్తామని ఎమ్మల్యే మధుసూదన్ రెడ్డి తెలిపారు. బుధవారం ఆయన మాట్లాడుతూ.. బ్రిడ్జి నిర్మాణం పూర్తయిందని, ఇరువైపులా అప్రోచ్ రోడ్ల కోసం మంత్రి కోమటిరెడ్డి వెంకట రెడ్డి రూ. 5 కోట్లు మంజూరు చేశారని వెల్లడించారు. అప్రోచ్ మట్టి వేయగానే బ్రిడ్జిని ప్రారంభిస్తామని ఆయన వెల్లడించారు.