కామారెడ్డి: పిట్లం మండల అయ్యప్ప సేవా సమితి ఆధ్వర్యంలో నేడు రక్తదాన శిబిరం నిర్వహించనున్నట్లు అయ్యప్ప ఆలయ కమిటీ సభ్యులు ఒక ప్రకటనలో తెలిపారు. అయ్యప్ప ఆలయ ఆవరణలో ఉదయం 9:30 గంటలకు ఈ కార్యక్రమం ప్రారంభించనున్నట్లు పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో రక్త దాతలు అధిక సంఖ్యలో పాల్గొని విజయవంతం చేయాలని కోరారు.