KMR: దేవి శరన్నవరాత్రి ఉత్సవాల్లో భాగంగా మద్నూర్లో నిర్వహిస్తున్న ఉత్సవాల్లో భాగంగా బుధవారం రాత్రి ముస్లిం దంపతులు అమ్మవారికి పూజలు చేసి మతసామరస్యాన్ని చాటుకున్నారు. వారు మాట్లాడుతూ.. దుర్గాదేవి ఆశీస్సులతో ప్రతి ఒక్కరూ సంతోషంగా ఉండాలని వేడుకున్నట్లు చెప్పారు. దుర్గామాత మండప నిర్వాహకులు వారికి అమ్మవారి మెమెంటోను బహుకరించి సత్కరించారు.