KMR: పిట్లం ఎంపీడీవో కార్యాలయంలో శనివారం బాన్సువాడ సబ్ కలెక్టర్ కిరణ్మయి పంచాయతీ కార్యదర్శులతో సమీక్ష నిర్వహించారు. ఇళ్ల నిర్మాణాల ప్రస్తుత స్థితిని, లక్ష్యాలను అడిగి తెలుసుకున్నారు. నిర్మాణం పనుల్లో వేగం పెంచాలన్నారు. ఇందిరమ్మ ఇళ్లు కట్టుకోవడానికి ముందుకు రాని వారి స్థానంలో అర్హులైన ఇతరులను ఎంపిక చేయాలని ఆమె ఆదేశించారు.