KMM: ఖమ్మంలోని ఇల్లందు క్రాస్ రోడ్డు సబ్ స్టేషన్ పరిధిలోని ప్రశాంత్ నగర్ ఫీడర్ పరిధిలో శనివారం విద్యుత్ సరఫరాను నిలిపివేస్తున్నట్లు విద్యుత్ శాఖ అధికారులు తెలిపారు. విద్యుత్ లైన్ల మరమ్మత్తుల కారణంగా ప్రశాంత్ నగర్, బాలాజీ నగర్, యుపిహెచ్ కాలనీలలో ఉదయం 9:30 నుంచి 11:30 వరకు విద్యుత్ అంతరాయం ఏర్పడనుంది. ఈ విషయాన్ని ప్రజలు గమనించి సహకరించాలన్నారు.