MNCL: జన్నారం పట్టణంలోని అటవీశాఖ ఎఫ్డిఓ కార్యాలయం ఫర్నిచర్ను కోర్టు ఆదేశాల మేరకు సిబ్బంది జప్తు చేశారు. బియ్యాల లింగన్న అనే కాంటాక్ట్ కార్మికున్ని అధికారులు గతంలో తొలగించారు. ఆయన కోర్టును ఆశ్రయించడంతో విధులలోకి తీసుకుని వేతనం చెల్లించాలని ఆదేశాలు ఇచ్చింది. అయితే అధికారులు పట్టించుకోకపోవడంతో కోర్టు ఆదేశాల మేరకు కార్యాలయ ఫర్నిచర్ను సిబ్బంది జప్తు చేశారు.