ADB: మాజీ సీఎం కేసీఆర్ పుట్టినరోజును పురస్కరించుకొని నేరడిగొండ మండల కేంద్రంలో ఎమ్మెల్యే అనిల్ జాదవ్ సమక్షంలో రక్తదాన శిబిరాన్ని ఏర్పాటు చేశారు. కార్యక్రమంలో పలు మండలాలకు చెందిన నాయకులు స్వచ్ఛందంగా రక్తదానం చేసి ఆదర్శంగా నిలిచారు. ఈ మేరకు వారిని ఎమ్మెల్యే అనిల్ జాదవ్ అభినందించారు. మాజీ ఎంపీపీ శ్రీనివాసరెడ్డి, సంతోష్ సింగ్ తదితరులున్నారు.