BDK:పెండింగ్లో ఉన్న కేసుల వివరాల గురించి ఎస్సై రమాదేవిని డీఎస్పీ అబ్దుల్ రహమాన్ వివరాలు అడిగి తెలుసుకున్నారు. వార్షిక తనిఖీల్లో భాగంగా శనివారం సుజాతనగర్ పోలీస్ స్టేషన్ను కొత్తగూడెం డీఎస్పీ తనిఖీ చేశారు. పోలీస్ స్టేషన్ రికార్డులను, పరిసరాలను పరిశీలించారు. అలాగే పోలీస్ సిబ్బందికి దిశా నిర్దేశం చేశారు. వారితో సీఐ వెంకటేశ్వర్లు, సీసీ బాబురావు ఉన్నారు.