KMM: సత్తుపల్లి పట్టణంలోని కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో మంగళవారం రానున్న క్రిస్మస్ పండుగ సందర్భంగా నేషనల్ క్రిస్టియన్ కౌన్సిల్ కరుణాకర్, హోప్ మినిస్ట్రీస్ సేవా సంస్థ వారి ఆధ్వర్యంలో 50 మంది పాస్టర్లకు ఎమ్మెల్యే డాక్టర్ మట్ట రాఘమాయి చేతుల మీదుగా దుస్తులు పంపిణీ చేశారు. క్రిస్మస్ పండుగ పదిమందికి ప్రేమ పంచడం సూచిస్తుందని ఎమ్మెల్యే తెలిపారు.