NGKL: జిల్లాలో చేపట్టనున్న జన గణన విధులను అధికారులు సిబ్బంది పక్కాగా చేపట్టాలని జిల్లా కలెక్టర్ బదావత్ సంతోష్ సూచించారు. కలెక్టర్ కార్యాలయంలోని ప్రధాన సమావేశ మందిరంలో 2027 జన గణనపై జిల్లా ప్రణాళిక శాఖ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన మొదటి విడత శిక్షణ తరగతులను ప్రారంభించారు. అనంతరం మాట్లాడుతూ.. జన గణన ఎలాంటి పొరపాట్లు జరగకుండా పకడ్బందీగా నిర్వహించాలన్నారు.