MBNR: జాతిపిత మహాత్మా గాంధీ ఆశయాలను ప్రతి ఒక్కరం కొనసాగిద్దామని మహబూబ్నగర్ జిల్లా దేవరకద్ర ఎమ్మెల్యే జీ. మధుసూదన్ రెడ్డి అన్నారు. గురువారం గాంధీ జయంతిని పురస్కరించుకొని దేవరకద్ర పట్టణంలోని మహాత్మా గాంధీ విగ్రహానికి పూలమాలలతో ఘనంగా నివాళులు అర్పించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. సేవా అహింస మార్గాన్ని ఎంచుకున్న మహాత్మా గాంధీ ఎందరికో ఆదర్శ పురుషుడని అన్నారు.