MBNR: ఉమ్మడి పాలమూరు జిల్లా వ్యాప్తంగా ఇవాళ నవోదయ ప్రవేశ పరీక్ష జరగనుంది. 2026- 27 విద్యా సంవత్సరానికి 29 పరీక్ష కేంద్రాల్లో 7,115 మంది విద్యార్థులు హాజరుకానున్నారు. శనివారం ఉదయం 11:30 నుంచి మధ్యాహ్నం 1:30 వరకు పరీక్ష జరుగుతుంది. పరీక్షకు అరగంట ముందే కేంద్రాల్లోకి అనుమతిస్తారు. మహబూబ్నగర్ వట్టెం జవహర్ నవోదయ పాఠశాలలో 80 సీట్లు ఉన్నాయి.