VZM: తెర్లాం మండలం చినగొలుగువలస అగ్నిప్రమాద బాధితులకు వెంటనే సహాయ చర్యలు చేపట్టాలని ఎమ్మెల్యే బేబినాయన అధికారులను ఆదేశించారు. ఘటన తెలుసుకున్న ఆయన ఇవాళ రెవెన్యూ అధికారులకు ఫోన్ చేసి, బాధితులకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా సహాయం అందించాలని MRO హేమంత్కుమార్కు సూచించారు. బాధితులకు అండగా ఉంటామని హామీ ఇచ్చారు.