KMR: ఎల్లారెడ్డి మండలం జానకంపల్లి కుర్దు గ్రామంలో గురువారం అటవీశాఖ అధికారులు తనిఖీ చేపట్టారు. అక్రమంగా నిల్వ ఉంచిన టేకు దుంగలను అటవీశాఖ అధికారులు స్వాధీనం చేసుకున్నారు. ఎల్లారెడ్డి సెక్షన్ అధికారి శ్రీనివాస్ నాయక్ సిబ్బందితో నమ్మదగిన సమాచారం మేరకు ముఫ్టీ లో వెళ్లి రైతు గొల్ల నారాయణ పొలం వద్ద భద్రపరిచిన టేకు దుంగలను గుర్తించి స్వాధీనం చేసుకున్నారు.