KNR: హుస్నాబాద్ మున్సిపల్ కేంద్రంలోని పోలీస్ స్టేషన్ ప్రహరీ గోడ పక్కన, రోడ్డుకు ఇరువైపులా రోడ్డును ఆక్రమించి కూరగాయల దుకాణాలు వెలిచాయి. కొన్నేళ్లు గడుస్తున్నా పక్కనే ఉన్న పోలీసులు, మున్సిపల్ అధికారులు చూసీ చూడనట్లు ఉంటున్నారని స్థానికులు ఆరోపిస్తున్నారు. దీంతో ఆ రోడ్డు గుండా వెళ్లే వాహనదారులకు, బాటసారులకు నిత్యం ప్రమాదాలు జరుగుతున్నాయని వీటిపైన చర్యలు తీసుకోవాలన్నారు.