GDWL: అలంపూర్లోని ఆర్టీసీ బస్టాండ్లో పోలీసులు మంగళవారం విజిబుల్ పోలీసింగ్ తనిఖీలు నిర్వహించారు. ఇటీవల డీఎస్పీ సత్యనారాయణ స్టేషన్ను సందర్శించి విజిబుల్ పోలీసింగ్ పెంచాలని సూచించారు. ఆ మేరకు ఏఎస్ఐ ఎస్ఎం భాషా ఆధ్వర్యంలో పోలీసులు ఆర్టీసీ బస్టాండ్ వద్ద తనిఖీలు చేపట్టారు. అక్కడికి వచ్చిన ప్రయాణికులకు ప్రస్తుతం జరుగుతున్న నేరాలపై అవగాహన కల్పించారు.