NLG: ప్రజా సంక్షేమం, గ్రామాల అభివృద్ధి విషయంలో కాంగ్రెస్కు సోయిలేదని, అధికారంలోకి వచ్చినప్పటి నుంచి ప్రజలకు, రైతులకు ఎలాంటి మేలు జరగలేదని నకిరేకల్ మాజీ ఎమ్మెల్యే చిరుమర్తి లింగయ్య అన్నారు. గురువారం సాయంత్రం నార్కట్పల్లిలో బీఆర్ఎస్ బలపర్చిన సర్పంచ్ అభ్యర్థి దూదిమెట్ల సత్తయ్య యాదవ్ వార్డు సభ్యులకు మద్దతుగా ఇంటింటి ప్రచారం నిర్వహించారు.