వరంగల్: నిషేధిత గుట్కా కేంద్రంపై శుక్రవారం దాడి చేసినట్లు టాస్క్ ఫోర్స్ ఏసీపీ మధుసూదన్ తెలిపారు. ఆయన తెలిపిన వివరాల ప్రకారం హసన్పర్తి మండలం గాంధీనగర్ ప్రాంతానికి చెందిన అప్పని శ్రీధర్ ఇతర ప్రాంతాల నుంచి గుట్కాతెచ్చి నిల్వచేసి విక్రయిస్తున్నట్లు సమాచారం రావడంతో హసన్ పర్తి, టాస్క్ ఫోర్స్ పోలీసులు సంయుక్తంగా దాడులుచేశారు. రూ.10 వేల గుట్కాలు స్వాధీనం చేసుకున్నారు.