BDK: కొత్తగూడెం సొసైటీ కార్యాలయంలో సోమవారం ఏర్పాటుచేసిన సమావేశంలో ఛైర్మన్ మండే వీర హనుమంతరావు మాట్లాడారు. సొసైటీ ఆధ్వర్యంలో 12 ధాన్యం కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేయడానికి తీర్మానం చేశామన్నారు. సొసైటీ పరిధిలోని నాలుగు మండలాల రైతులకు ఇబ్బందులు లేకుండా యూరియా సరఫరా చేయడానికి అధికంగా యూరియా కేటాయించాలని తీర్మానించారు.