BHPL: కాటారం మండలం చింతకాని పరిధిలోని రోటీపొదాల వాగులో ఆదివారం సాయంత్రం పురాతన స్వామి విగ్రహం లభ్యమైనట్లు స్థానికులు తెలిపారు. విష్ణుమూర్తి అవతారాన్ని పోలిన ఈ విగ్రహాన్ని స్థానికులు గుర్తించి జాగ్రత్తగా బయటకు తీశారు. ఈ విషయం తెలిసిన వెంటనే గ్రామస్థులు పెద్ద సంఖ్యలో వాగు వద్దకు చేరుకుని స్వామివారికి ప్రత్యేక పూజలు, అభిషేకాలు నిర్వహించారు.