JN: రోడ్డు ప్రమాదంలో ఓ వ్యక్తి మరణించగా, మరొకరికి తీవ్ర గాయాలైన ఘటన బచ్చన్నపేట మండలంలో బుధవారం సాయంత్రం జరిగింది. బండనాగారంకు చెందిన నల్ల రాజేందర్(23) ఈదులకంటి రమేష్(28)లు బైకుపై వెళ్తున్నారు. ఈ క్రమంలో మధ్యప్రదేశ్ వెళుతున్న ఆయిల్ ట్యాంకర్ను ఢీకొట్టగా.. నల్ల రాజేందర్ అక్కడికక్కడ మృతిచెందాడు. రమేష్కు తీవ్ర గాయాలవగా ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నాడు.