KMM: మాజీ ప్రధాని మన్మోహన్ సింగ్ మృతి పట్ల వైరా ఎమ్మెల్యే రాందాస్ నాయక్, మంత్రి తుమ్మల నాగేశ్వరరావు సంతాపం తెలిపారు. దేశ ఆర్థిక వ్యవస్థను వృద్ధి పథంలో నడిపించిన దూరదృష్టి కలిగిన నాయకుడు మన్మోహన్ సింగ్ అని కొనియాడారు. కేంద్ర ఆర్థికమంత్రిగా దేశంలో అనేక ఆర్థిక సంస్కరణలు తీసుకువచ్చారని చెప్పారు. ఆయన ఆత్మకు శాంతి చేకూరాలని ఆ భగవంతుడిని ప్రార్థిస్తున్నట్లు పేర్కొన్నారు.