SRPT: ఈనెల 10, 11, 12 తేదీల్లో హుజూర్ నగర్లోని శ్రీ లక్ష్మీ ఫంక్షన్ హాల్లో జరిగే జిల్లా స్థాయి రాజకీయ శిక్షణ తరగతులను జయప్రదం చేయాలని సీపీఎం జిల్లా కార్యదర్శి వర్గ సభ్యులు కోట గోపి పిలుపునిచ్చారు. ఆదివారం మద్దిరాల మండలం గోరంట్లలో నిర్వహించిన పార్టీ సమావేశంలో పాల్గొని మాట్లాడారు. కేంద్ర ప్రభుత్వం అనుసరిస్తున్న ప్రజా వ్యతిరేక విధానాలపై పోరాడుతామన్నారు.