వరంగల్: వర్ధన్నపేట మండలం ఇల్లంద వ్యవసాయ మార్కెట్లోని ధాన్యం కొనుగోలు కేంద్రాన్ని మంగళవారం ఆకస్మికంగా తనిఖీ చేసి రైతుల సమస్యలను ఎమ్మెల్యే నాగారాజు అడిగి తెలుసుకున్నారు. ధాన్యం అమ్మిన వారికి కాంగ్రెస్ ప్రజా ప్రభుత్వం ఇచ్చిన మాట ప్రకారం క్వింటాకు రూ. 500 బోనస్ మద్దతు ధర వస్తుందా లేదా అని ప్రతి ఒక్క రైతుని అడిగి తెలుసుకున్నారు.