KMM: జిల్లాలో చేపట్టిన బడిబాట కార్యక్రమం సత్ఫలితాలను ఇస్తుందని డీఈవో సత్యనారాయణ తెలిపారు. ఈ నెల 12 నుంచి ఇప్పటి వరకు 5,807 మంది విద్యార్థులు ప్రభుత్వ పాఠశాల్లో చేరారని చెప్పారు. జిల్లాలో గతంలో మూతబడిన 10 పాఠశాలలను పున:ప్రారంభించామన్నారు. రఘునాథపాలెం మండలం పువ్వాడ నగర్లో కొత్తపాఠశాల ప్రారంభించగా తొలి ఏడాడిలోనే 40 మంది విద్యార్థులు చేరారన్నారు.