SKLM: కనిగిరిలో చదువుకుని ఉన్నత విద్యాభ్యాసం చేసి అమెరికాలో స్థిరపడిన బండి రాజేష్, ఝాన్సీ దంపతులు తమ సొంత గ్రామంపై మమకారాన్ని చూపించారు. వారు స్వదేశం ఇండియా వచ్చిన సందర్బంగా బుధవారం విజేత కాలేజీకి చెందిన ప్రతిభావంతులైన పలువురు విద్యార్థిని, విద్యార్థులను అభినందించి, వారికి 50 వేల రూపాయల నగదును ఫీజుల నిమిత్తం అందచేశారు.