NLG: చిట్యాల మండలం పెద్ద కాపర్తి ప్రాథమిక పాఠశాలలో బుధవారం ఐదుగురు నూతన విద్యార్థులు అడ్మిషన్లు పొందారు. ప్రభుత్వం అందించే అన్ని పథకాలను విద్యార్థులకు అందిస్తామని హెచ్ఎం ఆకుల భవాని తెలిపారు. నాణ్యమైన విద్యతో పాటు మానసిక వికాసానికి తోడ్పడతామని తల్లిదండ్రులకు తెలిపారు. పేరెంట్స్ తిరుపతి, ఆంజనేయులు, అశోక్, టీచర్లు మంజుల, తిమ్మయ్య, సరళ పాల్గొన్నారు.