అహ్మదాబాద్లో ఇటీవల ప్రమాదానికి గురైన ఎయిరిండియా విమానంపై విచారణ కొనసాగుతోంది. ఈ విమానం కుడి వైపు ఇంజిన్ను ప్రమాదం జరగడానికి మూడు నెలల ముందు, అంటే మార్చి నెలలోనే మార్చినట్లు విచారణలో తేలింది. అలాగే ఈ విమానం 2023 జూన్లో పూర్తి స్థాయి తనిఖీలకు వెళ్లిందని కూడా సమాచారం. కాగా, ఈ వివరాలు ప్రమాదానికి గల కారణాలపై దర్యాప్తునకు కీలకం కానున్నాయి.