స్కూళ్లలో మూడో భాషగా హిందీ తప్పనిసరిగా చదవాలని మహారాష్ట్ర ప్రభుత్వం తొలుత నోటిఫికేషన్ విడుదల చేసింది. అయితే ప్రతిపక్షాలు, మహారాష్ట్ర నవ నిర్మాణ్ సేన నుంచి వ్యతిరేకత రావడంతో ప్రభుత్వం వెనక్కి తగ్గింది. నోటిఫికేషన్లో మార్పులు చేసింది. తప్పనిసరి అనే పదాన్ని తొలగించింది. హిందీ బదులు మరో భాషను ఎంచుకునేందుకు అవకాశం కల్పించింది.