BHPL: టేకుమట్ల మండలం వెలిశాల గ్రామానికి చెందిన గాజర్ల రవి అలియాస్ గణేశ్ అలియాస్ ఉదయ్ 40 ఏళ్ల మావో ఉద్యమ ప్రస్థానం ముగిసింది. అప్పటి రాజశేఖర్ రెడ్డి ప్రభుత్వంతో జరిగిన చర్చల ప్రతినిధులలో గాజర్ల రవి ఒకరు. సెంట్రల్ కమిటీ సభ్యుడిగా ఏవోబీ రాష్ట్ర కార్యదర్శిగా పనిచేస్తున్నారు. అంతేకాదు, గాజర్ల రవిపై రూ.25 లక్షల రివార్డు ఉంది.