VZM: ఉపాధి హామీ పథకం కార్మికుల సమస్యలు పరిష్కరించాలని వ్యవసాయ కార్మిక సంఘం జిల్లా అధ్యక్షుడు జి. శ్రీనివాస్ డిమాండ్ చేశారు. బుధవారం గజపతినగరం మండలంలోని పురిటిపెంట గ్రామంలో పలు సమస్యలతో కూడిన వినతి పత్రాన్ని సచివాలయంలో అందజేశారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ.. కార్మికుల బిల్లుల బకాయిలు చెల్లించాలని, పాత పద్ధతిలోనే పనులు చేయించాలని కోరారు.