JGL: రాష్ట్రంలోని పలు జిల్లాలకు నూతనంగా ఏడు జవహర్ నవోదయ విద్యాలయాలు మంజూరయ్యాయి. ఇందులో జిల్లాకు కూడా ఒక విద్యాలయం మంజూరు కాగా.. విద్యాలయాన్ని కోరుట్లలో ఏర్పాటు చేశారు. అయితే, నూతనంగా ఏర్పాటు చేసిన ఈ నవోదయ విద్యాలయాల్లో జూలై 14వ తేదీ వరకు అడ్మిషన్లను పూర్తి చేసి, తరగతులను ప్రారంభించేందుకు ఏర్పాట్లు చేస్తున్నట్లు సంబంధిత అధికారులు తెలిపారు.