TPT: యోగాతోనే సంపూర్ణ ఆరోగ్యంగా ఉండవచ్చునని జిల్లా కలెక్టర్ ఎస్ వెంకటేశ్వర్ అన్నారు. బుధవారం శ్రీకాళహస్తి పట్టణంలో యోగా ఆంధ్ర కార్యక్రమాన్ని ఎమ్మెల్యే సుధీర్ రెడ్డితో కలిసి ఆయన ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ప్రతి ఒక్కరూ తమ జీవనశైలిలో యోగాను ఒక భాగం చేసుకోవాలన్నారు. హిందువుల ఆరోగ్యంగా శారీరకంగా దృఢంగా ఉండవచ్చునని అన్నారు.