SRD: జిన్నారం మండలం మాదారం గ్రామం నుంచి జానకం పేట గ్రామం వరకు రోడ్డు గుంతల మయంగా మారింది. దుమ్ము, ధూళి నడుమ ప్రయాణం చేయాలంటే నరకం కనిపిస్తోందని ప్రయాణికులు వాపోతున్నారు. గతంలోనే మరమ్మతులు చేసిన మళ్లీ రోడ్డు శిథిలమై గుంతలమయంగా మారిందని వాహనదారులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. మరమ్మతులు చేపట్టాలని వాహనదారులు కోరుతున్నారు..