BDK: గిరిజన ఆశ్రమ పాఠశాలలో, పోస్ట్ మెట్రిక్ కళాశాల వసతి గృహాలలో పని చేస్తున్న కార్మికుల జీతాల తగ్గింపుకి నిరసనగా గత 20 రోజులుగా ఇల్లందులో సమ్మె నిర్వహిస్తున్నారు. మంగళవారం DYFI జిల్లా కమిటీ తరఫున జిల్లా కార్యదర్శి కాళంగి హరికృష్ణ సంఘీభావం తెలిపారు. వారు మాట్లాడుతూ.. కార్మికుల జీతాలను వెంటనే విడుదల చేయాలని ఆయన ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు.