KNR: కమలాపూర్ మండల పరిధిలోని ఉప్పల్ రైల్వే ఓవర్ బ్రిడ్జి (ఆర్ఓబి) నిర్మాణ పనులను కేంద్రమంత్రి బండి సంజయ్ కుమార్ విధించిన గడువులోపు పూర్తి చేయాలని బిజెపి జిల్లా అధ్యక్షుడు గంగాడి కృష్ణారెడ్డి తెలిపారు. బుధవారం కమలాపూర్ మండల బిజెపి శ్రేణులతో కలిసి ఉప్పల్ ఆర్ఓబి నిర్మాణ పనులను పరిశీలించారు. రైల్వే అధికారులు, సంబంధిత కాంట్రాక్టర్తో చర్చించారు