MNCL: రాష్ట్ర ప్రభుత్వం పెంచిన బస్ చార్జీలను, బస్ పాస్ చార్జీలు తగ్గించాలని కోరుతూ MCPIU పార్టీ ఆధ్వర్యంలో బెల్లంపల్లి RDO కార్యాలయంలో SO గురువయ్యకు బుధవారం వినతిపత్రం అందజేశారు. నాయకులు రాజేంద్ర ప్రసాద్, వెంకటేష్ మాట్లాడుతూ.. చార్జీలు పెంచి ఆర్థిక భారంతో సతమతమవుతున్న సామాన్య ప్రజలు, విద్యార్థులను ఇబ్బందులకు గురిచేయడం సరికాదన్నారు.