BHPL: జిల్లా కేంద్రంలోని సింగరేణి ఏరియాలో మంగళవారం జీఎం సెక్యూరిటీ లక్ష్మినారాయణ విస్తృతంగా పర్యటించారు. వారు మాట్లాడుతూ.. ముఖ్యంగా సింగరేణి స్థలాలు కబ్జా కాకుండా ఫెన్సింగ్ వేయించాలన్నారు. రికార్డులను తనిఖీ చేసి, సోలార్ ప్లాంట్లో భద్రతా చర్యలను పర్యవేక్షించారు. ఉప్పల్ నుండి బొగ్గు రవాణాను పరిశీలించి పలు సూచనలు చేశారు.