MDK: బసవ జయంతి సందర్భంగా సదాశివపేట పట్టణంలో స్థానిక బసవ సేవ సాధన్లో వీరశైవ సమాజం ఆధ్వర్యంలో మంగళవారం కుస్తీ పోటీలు నిర్వహించారు. ఈ కుస్తీ పోటీలో వివిధ ప్రాంతాల మల్లయోధులు పాల్గొని కుస్తీలు పట్టారు. అనంతరం వీరశైవ సమాజం సభ్యులు విజేతలకు బహుమతులు ప్రదానం చేశారు. కార్యక్రమంలో వీరశైవ సమాజం సభ్యులు పాల్గొన్నారు.