KRNL: ఆదోని తాత్కాలిక మున్సిపల్ ఛైర్మన్గా నియమితులైన మొహమ్మద్ గౌస్ను MLC మధుసూదన్ ఇవాళ సన్మానించారు. ఈనెల 16వ తేదీన ఛైర్ పర్సన్ శాంతను YCP సభ్యులు అవిశ్వాస తీర్మానం ప్రవేశపెట్టి దించిన సంగతి తెలిసిందే. దీంతో శాశ్వత ఛైర్మన్ ఎన్నిక అయ్యేంతవరకు తాత్కాలికంగా వైస్ ఛైర్మన్ ను ఇన్ఛార్జి ఛైర్మన్గా ఎన్నుకోవాలని రాష్ట్ర పురపాలక శాఖ ఉత్తర్వులు జారీ చేసింది.