KTM: అశ్వారావుపేట, దమ్మపేట మండలంలో తెలంగాణ అవతరణ దినోత్సవం సందర్భంగా మాజీ MLA మెచ్చా నాగేశ్వరరావు బీఆర్ఎస్ జెండాతో పాటు జాతీయ జెండాను ఆవిష్కరించారు. అనంతరం తెలంగాణ తల్లి, బీఆర్ అంబేద్కర్, ప్రొఫెసర్ జయశంకర్ విగ్రహాలకు నివాళులర్పించారు. మాజీ సీఎం కేసీఆర్ నాయకత్వం.. సకల జనుల ఉద్యమం, ఎందరో అమరవీరుల త్యాగాల ఫలితంగానే తెలంగాణ రాష్ట్రం సిద్ధించిందన్నారు.