RR: కుమ్మరుల అభివృద్ధికి నూతన సంఘం కృషి చేయాలని సంఘం నాయకులు సూచించారు. కడ్తాల్ కుమ్మరి సంఘం నూతన కార్యవర్గాన్ని ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు. ఈ సందర్భంగా నూతన అధ్యక్షులుగా శ్రీశైలం, ఉపాధ్యక్షులుగా శ్రీకాంత్, శివ ప్రధాన కార్యదర్శిగా యాదగిరి, కోశాధికారులుగా ప్రశాంత్, రమేష్లను ఎన్నుకున్నారు. ఎన్నికైన నూతన కార్యవర్గాన్ని సంఘం నాయకులు సన్మానించి, అభినందించారు.