KNR: రెండో విడత గ్రామపంచాయతీ ఎన్నికల పోలింగ్ రేపు జరగనుంది. శనివారం తిమ్మాపూర్ మండల ప్రజాపరిషత్ ఆధ్వర్యంలో వాగేశ్వరి ఇంజనీరింగ్ కళాశాలలో ఎన్నికల సామగ్రి పంపిణీ కార్యక్రమం జరిగింది. ఈ కార్యక్రమంలో ఆర్డీఓ మహేశ్వర్, డీపీఓ జగదీశ్వర్, ఎంపీడీవో రాజీవ్ మల్హోత్రా, తహశీల్దార్ శ్రీనివాస్ రెడ్డి, పోలింగ్ ఆర్ఆర్లు పాల్గొన్నారు. ఎన్నికలు సజావుగా సాగేలా ఏర్పాట్లు చేశారు.