PDPL: ఈనెల 28న జాతీయ లోక్ అదాలత్ నిర్వహిస్తున్నట్లు జిల్లా న్యాయమూర్తి కుంచాల సునీత తెలిపారు. న్యాయ సేవాధికార సంస్థ కార్యదర్శి భవానితో కలిసి ఆమె విలేకరుల సమావేశంలో మాట్లాడారు. రాజీమార్గం ద్వారా పెండింగ్ కేసులు పరిష్కరించుకోవాలని సూచించారు. సివిల్, క్రిమినల్ మొదలైన కేసులను ఉచితంగా పరిష్కరించుకోవచ్చని, కక్షిదారులు అవకాశాన్ని వినియోగించుకోవాలని కోరారు.