KMM: ఖమ్మం నగరంలో పారిశుధ్య పనులను మేయర్ పునుకొల్లు నీరజ పర్యవేక్షించారు. గురువారం నగరంలోని 52, 10, 11వ డివిజన్లో ఆయన విసృతంగా పర్యటించారు. ప్రధాన వీధులు, మార్కెట్ ప్రాంతాలు, రహదారులు, కాలనీలలో పారిశుద్ధ్య స్థితిని స్వయంగా పరిశీలించి సంబంధిత అధికారులకు సూచనలు చేశారు. మేయర్ మాట్లాడుతూ…పారిశుధ్య కార్మికులు క్రమంగా హాజరై, విధులు నిర్వర్తించాలన్నారు.