RR: యాచారం మండలంలోని అభివృద్ధి పనుల సమాచారం ఇవ్వడం లేదని మాల్ గ్రామ పంచాయతీ 1వ వార్డు సభ్యుడు ప్లకార్డులతో నిరసనకు దిగారు. తన వార్డులో జరుగుతున్న పనులకు సంబంధించి కనీసం కొబ్బరికాయ కొట్టేందుకు కూడా పిలవడం లేదని ఆయన ఆరోపించారు. సమాచారం దాచడం ప్రజాస్వామ్య విరుద్ధమని, దీనిపై పంచాయతీ కార్యదర్శి వివరణ ఇవ్వాలని డిమాండ్ చేశారు.